Monday, May 5, 2014

వేజ్ బోర్డు అమలు కోసం 'ఈనాడు' జర్నలిస్టుల ఎదురుచూపు

సుప్రీం కోర్టు ప్రమేయంతో... ముందుగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీ టీ ఐ), ఆ తర్వాత 'ది హిందూ' యాజమాన్యాలు మజితియ వేజ్ బోర్డ్ సిఫార్సులు అమలు చేస్తూ ఏప్రిల్ నెల నుంచి జీతం పెరగడంతో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో ఆశలు చిగురెత్తాయి. 

ముఖ్యంగా 'ఈనాడు' మిత్రులు ఇదే విషయం గురించి మాటి మాటికీ చర్చించుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ప్రకారం ఏప్రిల్ నెల జీతంతో పాటు పెరుగుదల ఉండాలి. మరి 'ఈనాడు' ఉద్యోగుల జీతాలు ఏప్రిల్ నెల 30 న పడిపోయాయి. కానీ కాణీ పెరగలేదు. ఇది అక్కడి ఉద్యోగుల్లో అశాంతి కి కారణం అయ్యింది. నిజానికి కులపోళ్ళు, ప్రాంతపోళ్ళు, గోత్రపోళ్లకు ఆయా యాజమాన్యాలు ప్రతిభ, ప్రయోజనాలతో సంబంధం లేకుండా  ఇప్పటికే పెంచాయి. 

"మరి ఇప్పుడేమి జరుగుతున్నదో అన్న ఆసక్తి, ఉత్కంఠ మా సంస్థలో పెరిగాయి. దీనిపై యాజమాన్యం ఏడో తేదీ లోపు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు," అని 'ఈనాడు' మిత్రుడొకరు చెప్పారు. సాక్షి, ఆంధ్ర జ్యోతి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. వీళ్ళంతా... గతంలో మాదిరిగా.. 'మాకు జీతాలు పెంచవద్దు..." అని రాయించుకుని జర్నలిస్టుల నోళ్ళు కొట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. 

వేతనాలు పెంచుతూ వేజ్ బోర్డు చేసిన సిఫార్సులను నిలువరించడానికి పత్రికల యాజమాన్యాలు కలివిడిగా, విడివిడిగా పోరాడి సుప్రీం ను చేరాయి. కానీ కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో జర్నలిస్టులకు అదనపు జీతాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 
జర్నలిస్టు మిత్రులారా... మీకు మేలు జరగాలని కోరుకుంటున్నాం.   

1 comments:

hari.S.babu said...

ప్రజలకి వార్తల్ని వివరించి విలువైన సామాచారాన్ని అందించి యేదో ఉద్దరిస్తామని డప్పు కొట్టుకునేవాళ్ళు తమ ఉద్యోగుల పట్ల ఇంత మధ్యయుగాల నాటి నియంతల మాదిరిగా ఉంటున్నారా?యెంత ఘోరం!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి