Tuesday, March 17, 2015

'ఆంధ్రప్రదేశ్' ఎడిటర్ గా కందుల రమేష్!

అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణాలలో మూడు మీడియాల్లో (ప్రింట్, టీవీ, ఆన్ లైన్) సమర్ధంగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక జర్నలిస్టు కందుల రమేష్. చాలా మంది తెలుగు జర్నలిస్టులు అంతర్జాలంలో తమ మెయిల్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందే రమేష్ బెంగళూరులో ఒక ఆన్ లైన్ మీడియా హౌజ్ లో పనిచేసారు. సీ వీ ఆర్ న్యూస్ లో కన్సల్టింగ్ ఎడిటర్ హోదాలో మూడు కీలక బాధ్యతలు (తెలుగు, ఇంగ్లిష్ ఛానెల్స్, హెల్త్ మాగజీన్) నిర్వహిస్తున్న ఆయన ఐ-న్యూస్, టీవీ 5 ఛానెల్స్ లో పనిచేసారు. అంతకన్నా ముందు "ది ట్రిబ్యూన్'' కు రిపోర్టర్ గా పనిచేసారు. సుప్రభాతం అనే తెలుగు మాగజీన్ లో కూడా ఆయన పనిచేసినట్లు గుర్తు. తను "సెంట్రల్ యూనివెర్సిటీ" ప్రొడక్ట్ అని చెబుతారు.
ఇప్పుడు కందుల రమేష్ చంద్రబాబు ప్రభుత్వ పత్రిక "ఆంధ్రప్రదేశ్" కు ఎడిటర్ గా నియమితులయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని దృవీకరణకు ఆయనకు ఒక మెయిల్ ఇచ్చాం... కానీ స్పందన రాలేదు. (ఆరంభంలో బాగా స్పందించే జర్నలిస్టులు ఒకటి రెండు ఛానెల్స్ లో చేరాక, కాస్త సంపాదించాక మెయిల్స్ కు, ఫోన్ కాల్స్ కు స్పందించారు మరి!).

"సొంతగా ఒక ఛానెల్ పెట్టాలని తను అనుకున్నాడు. మరి ఈ పత్రిక బాధ్యతలు ఎందుకు తెసుకున్నారో అర్థం కాలేదు," అని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. నిజానికి కందుల మూవ్ పెర్ఫెక్ట్. ఎందకంటే... ఇప్పుడు "ఆంధ్రప్రదేశ్" ఎడిటర్ గా మూడేళ్ళు పనిచేసి వచ్చే ఎన్నికలకు ముందు ఛానల్ ప్లాన్ చేస్తే అన్నిరకాలుగా బాగుంటుంది.   

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి