Thursday, April 30, 2015

10 టీవీ లో చేరబోతున్న పసునూరి శ్రీధర్ బాబు!

తెలుగు టెలివిజన్ రంగంలో ఉన్న అతి కొద్ది మంది నాణ్యమైన ఎడిటర్లలో ఒకరైన పసునూరి శ్రీధర్ బాబు... ప్రజల డబ్బుతో ఆరంభమైన 10 టీవీ  అసోసియేట్ ఎడిటర్ గా నియమితులయినట్లు తెలిసింది. ఈ మేరకు... ఛానెల్ యాజమాన్య బాధ్యతలు చూస్తున్న తమ్మినేని వీరభద్రం గారికి, శ్రీధర్ గారికి మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 
అరుణ్ సాగర్ గారు, ఆయన బృందం వెళ్ళిపోయాక తమ్మినేని బృందం ఒక సమర్ధమైన ఎడిటర్ కోసం వెతుకుతున్న క్రమంలో శ్రీధర్ దొరికినట్లు చెబుతున్నారు. సహజంగా కవి అయిన శ్రీధర్ గారు చెన్నైలో "ఇండియా టుడే" లో సుదీర్ఘకాలం పనిచేసి కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి హెచ్ ఎం టీవీ బృందంలో కీలక సభ్యుడిగా అద్భుత సేవలు అందించారు. తర్వాత అంకం రవి గారి నేతృత్వం లోని V-6 టీవీ లో ముందుగానే చేరి ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. పరిణామ క్రమంలో మళ్ళీ హెచ్ ఎం టీవీ లో చేరిన శ్రీధర్ గారు అక్కడి నుంచి బైటికి రావాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక అద్భుత అవకాశం కోసం వేచి చూస్తూ ఈ-టీవీ లో చర్చల్లో పాల్గొంటూ పుడమి పబ్లికేషన్ వారి కోసం యువతరాన్ని ఉద్దేశించి 'యంగ్ జోన్' పేరిట ఒక మంచి ఆంగ్ల పత్రిక తెస్తున్నారు. ఈ లోపు ఆయనకు 10 టీవీ లో అవకాశం లభించింది.  
కవితలు, నిశిత భావాల ప్రకటనకు అనేక వచనం పేరిట శ్రీధర్ బాబు ఒక బ్లాగు నిర్వహిస్తున్నారు.  

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి